Minister KTR | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బరాబర్ కుటుంబ పార్టీయేనని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తమ నాయకుడు కేసీఆర్ అని, ఆయనే తమ కుటుంబ పెద్ద అని చెప్పారు. మహబూబ్నగర్లో ప్రధాని మోదీ బీఆర్ఎస్పై చేసిన ఆరోపణలపై ఫైర్ అయ్యారు. మోదీ అంటే నమ్మించి మోసం చేయడమేనని ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. పాలమూరు సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆదివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ కేసీఆర్ చేతిలోనే పదిలంగా ఉన్నదని, కానీ బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని చురకలంటించారు.
కేంద్ర సర్కారు కిసాన్ సమ్మాన్ కింద ఇచ్చింది నామమాత్రమేనని, కానీ.. ఒక చిన్న రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు 72 వేల కోట్లను నేరుగా ఖాతాల్లో వేసిన విషయం మీరు తెలుసుకుంటే మంచిదని చెప్పారు. తెలంగాణలో రైతు రుణమాఫీ జరగనే లేదని మోదీ మాట్లాడటం మిలియన్ డాలర్ జోక్ అని ఎద్దేవా చేశారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక కొత్త రాష్ట్రం రెండుసార్లు రైతు రుణమాఫీకి నడుం బిగించిన ఏకైక సందర్భం తెలంగాణలోనే ఆవిషృతమైందని చెప్పారు. ‘అన్నదాత అప్పులు మాఫీ చేసిన జైకిసాన్ ప్రభుత్వం మాది!.. కార్పొరేట్ దోస్తులకు 14.5 లక్షల కోట్ల రుణాలను రద్దుచేసిన ..నై కిసాన్ సరారు మీది!’ అని మోదీ సర్కారునుద్దేశించి వ్యాఖ్యానించారు. కర్షకుల రక్తం కండ్ల జూసిన రైతు హంతక రాజ్యం మీది.! అంటూ మండిపడ్డారు. ప్రాజెక్టుల వల్ల చుక నీరు రాలేదనడం.. మోదీ అవివేకానికి నిదర్శనమని, తెలంగాణలో సాగునీటి విప్లవం సాగుతున్నదని చెప్పారు. ‘తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన మీరా మాట్లాడేది’ అని మోదీని నిలదీశారు. గిరిజన వర్సిటీ తెలంగాణ హకు అని, తొమ్మిదిన్నరేండ్లు తొకిపెట్టి.. విభజన చట్టంలోని హామీని తుంగలో తొకి.. ఆదివాసీ పిల్లలకు అన్యాయం చేసి..ఇప్పుడేదో ఉద్ధరించినట్టుగా ఫోజులు కొడుతున్నారని మండిపడ్డారు.