హైదరాబాద్: తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ కేక్ కట్ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా.. మంత్రి కేటీఆర్పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఇసుకతో రూపొందించిన కేటీఆర్ చిత్రం (స్యాండ్ ఆర్ట్), త్రీడీ ప్రదర్శ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్ యాదవ్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.