హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పురపాలక అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. బుధవారం నానక్రామ్గూడలోని హెచ్జీసీఎల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ ఉన్నతాధికారులతోమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏకధాటిక కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.