హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్లో వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ అయింది. స్థాయీ సంఘం చైర్మన్ విజయసాయి రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జయేష్ రంజన్ హాజరయ్యారు. వీరితోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారులు, ఫిక్కి, డిక్కి, ఎస్బీఐ, ఫార్మారంగ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ-కామర్స్ రంగానికి ప్రోత్సాహం, నియంత్రణ తదితర అంశాలపై చర్చిస్తున్నారు.
పార్లమెంటరీ స్థాయూ సంఘంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు నామా నాగేశ్వరరావు, అరవింద్, ఆంధ్రప్రదేశ్కు చెందిన మాగుంట శ్రీనివాసులు, ఇతరులు సభ్యులుగా ఉన్నారు.