Minister KTR | త్వరలో నాలుగు మొబిలిటీ క్లస్టర్లను ప్రకటించి.. ఆరు బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గిస్తూ.. సుస్థిర ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ హెచ్ఐసీసీలో ప్రభుత్వం ప్రారంభించిన ఈ మొబిలిటీ వీక్లో భాగంగా రెండో రోజు జరిగిన ఈవీ సదస్సుకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు దిగ్గజ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకున్నది.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ భారత్లో తొలిసారిగా హైదరాబాద్లోనే ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోలార్ ఎనర్జీలో దేశంలో రాష్ట్రం రెండోస్థానంలో ఉందని, ఎలక్ట్రిక్ వాహనాలను
ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆటోమోటివ్ సొల్యూషన్స్లో హైదరాబాద్ దినదినాభివృద్ధి చెందుతుదన్న కేటీఆ.. ఈ క్రమంలోనే ఈవీ-ఈఎస్ఎస్-2020 పథకంపైనా దృష్టి సారించామని చెప్పారు. దీంతో విద్యుత్ వాహనాలు, బ్యాటరీ తయారీ కోసం పెట్టుబడులు సులభతరం చేసి.. రాష్ట్రంలో ఈవీల సంఖ్య పెరిగే విధంగా చేయడం.. ఛార్జింగ్ స్టేషన్లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించారు.
దేశంలో మొట్టమొదటి న్యూ మొబిలిటీ ఫోకస్ క్లస్టర్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని ప్రకటిస్తున్నామని, దీంతో ఈ రంగంలో తెలంగాణను తయారీ, పరిశోధనలకు సంబంధించి మంచి మౌలిక వసతులతో గమ్యస్థానంగా మార్చనున్నామన్నారు. జహీరాబాద్, సీతారాంపూర్లో ఈవీ తయారీ క్లస్టర్లను, దివిటిపల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (ESS) క్లస్టర్ను, యెంకతల వద్ద ఇన్నోవేషన్ క్లస్టర్ను అభివృద్ధి చేస్తున్నట్లున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. యెంకతలలో ఈ సౌకర్యాలను అభివృద్ధికి జర్మన్ సర్వీస్ ప్రొవైడర్ ఏటీఎస్-టీయూవీ రైన్ల్యాండ్తో రాష్ట్రం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది.
ఈ సౌకర్యాల అభివృద్ధికి రూ.250 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్, డిజిటల్ కాక్పిట్ సొల్యూషన్స్, వెహికల్-టు-ఎవ్రీథింగ్ (వి2ఎక్స్) కనెక్టివిటీ, ఆటోమోటివ్ సైబర్సెక్యూరిటీ తదితరాల అభివృద్ధిలో కూడా హైదరాబాద్ ముందంజలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నాయి. అమర్ రాజా రూ.9500కోట్లతో బ్యాటరీల తయారీ, ఆటోమోటివ్ ప్రూవింగ్ గ్రౌండ్స్ ఏర్పాటు కోసం హ్యుందాయ్ రూ.1400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు బిల్టీ ఎలక్ట్రిక్ రూ.1,100 కోట్లు, దేశ మొట్టమొదటి మల్టీ గిగావాట్ క్యాథోడ్ తయారీ యూనిట్ కోసం అల్లాక్స్ రూ.750 కోట్లు, రూ. 600కోట్లతో అటెరో బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్, గ్రావ్టన్ రూ.150 కోట్లతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కేంద్రం ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టనున్నాయి. అపోలో టైర్స్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ను, బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఆటోమోటివ్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ భద్రతా పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి 3వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నది. ఫిస్కర్ ఇంజినీరింగ్ ఆర్అండ్బీ అభివృద్ధి కోసం అమెరికా వెలుపల తొలిసారి ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు అధికారులతో కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి.
World-class Mobility Valley in Telangana!
Minister @KTRBRS unveiled one-of-its-kind Telangana Mobility Valley (TMV) at the Mobility Next Hyderabad Summit 2023.#mobilitynexthyderabad #emobilityweek2023 pic.twitter.com/Bz5iBP1LtD
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 6, 2023