రంగారెడ్డి : నా దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగం వదిలేసి వచ్చేశానని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాను ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇండియా ఇప్పుడు ఉన్నట్లుగా లేదని అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా దేశంలో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కిస్మత్పూర్లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో ఐ టెక్నాలజీ ఇంజనీరింగ్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అతి పెద్ద వైద్య పరికరాల పార్కును ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అందరికీ కంటి పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.