హైదరాబాద్: బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యార్థులు లేవనెత్తిన అంశాలను సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు.
విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారని తేజాగౌడ్ అనే విద్యార్థి మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
Will take all the issues mentioned to the notice of Hon’ble CM KCR Garu & Education Minister @SabithaindraTRS Garu
Kindly be assured that we are committed to resolving any challenges with respect to improving quality of education https://t.co/jNLkemAkMU
— KTR (@KTRTRS) June 15, 2022
కాగా, మంత్రి కేటీఆర్ ట్వీట్కు స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఆర్జీయూకేటీలో వీలైనంత తొందరగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేడు సంబంధిత వీసీతో సమావేశమవుతానని చెప్పారు.
I have called for a meeting with the concerned VC today regarding the matter. We will resolve all relating issues ASAP.
— SabithaReddy (@SabithaindraTRS) June 15, 2022