హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తన నానమ్మ నివసించిన గ్రామంలో ఆమె జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
తన నానమ్మ గ్రామం పోసాన్పల్లి ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఉన్నదని, 1940లో అప్పర్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నివాస భూములు ముంపునకు గురయ్యాయని వివరించారు. అయితే, ఆ ఇంటి అవశేషాలు ఇంకా ఉన్నాయని పేర్కొన్నారు. తాను ఆ గ్రామాన్ని సందర్శించానని కేటీఆర్ ఆదివారం ట్విట్టర్లో తెలిపారు.
కామారెడ్డి జిల్లాలోని తన నానమ్మ గ్రామం పోసాన్పల్లిలో మంత్రి కేటీఆర్ (ఫైల్)