KTR | హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ( BRS Party ) విస్తృతంగా చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు మే నెలాఖరు వరకు నిర్వహించుకోవచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తేదీ నాటికి ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేసుకోవాలని పార్టీ సూచించిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాల నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్( CM KCR ) ఆదేశాల మేరకు మరింత కులంకషంగా, విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కేటీఆర్ ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను( Party Cadre ) కోరారు. ప్రస్తుతం గడువుని మరింతగా పెంచిన నేపథ్యంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు మరింత విస్తారంగా నిర్వహించుకునే వీలు కలుగుతుందని కేటీఆర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో ఈ మేరకు సమన్వయం చేసుకోవాలని పార్టీ నియమించిన జిల్లా ఇంచార్జిలకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు.