పెద్దపల్లి : ప్రజలంతా ఐక్యమత్యంగా ఉండడంవల్ల గ్రామాభివృద్ధిలో మంచి ఫలితాలు సాధించగలుగుతారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం జూలపల్లి మండలంలోని తన స్వగ్రామం కుమ్మరి కుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు.
గ్రామంలో దాదాపు రూ.7 కోట్ల వ్యయంతో గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడీ కేంద్రం, స్వాగత తోరణం, కుమ్మరి కుంట నుంచి ఖిలా వనపర్తి వరకు బిటి రోడ్డు, అంబేడ్కర్ విగ్రహం, పలు సి.సి రోడ్లు, కుమ్మరికుంట నుంచి బాలరాజు పల్లె బిటి రోడ్డు బ్రిడ్జి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఎల్ ఎమ్ కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు దుస్తులు, క్రీడాకారులకు క్రీడా వస్తువులు, పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో బాగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎం.ఎల్.ఏ.చందర్, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ రఘువీర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.