జగిత్యాల : భారీ వర్షాలకు ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాగా, వర్షాలు, వరదలను లెక్క చేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముంపునకు గురైన ప్రజల సమస్యలను తెలుసుకుంటూనే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అసాధారణ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని మంత్రి కొప్పుల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వీలైనంత సహాయం అందిచాలన్నారు. ముంపు ప్రాంత బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.