జగిత్యాల : ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో పల్లె ప్రగతి(palle pragathi) కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్( Minister Koppula Eshwar) అన్నారు. జగిత్యాల( jagtial district) జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జాతీయ పంచాయతీ అవార్డ్ పురస్కారాల్లో ఉత్తమ పంచాయతీలుగా నిలిచిన 27 పంచాయతీల సర్పంచులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) చేపట్టిన పల్లెప్రగతితో గ్రామాలు సర్వతో ముఖాభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.
గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు నిర్మాణం, ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ, కంపోస్టు షెడ్లు, నర్సరీలు, వైకుంఠ ధామాల నిర్మాణం వంటి వసతులు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలను ప్రకటిస్తే అందులో 19 పంచాయతీలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి కావడం గర్వకారణమ న్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వంద శాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి గుర్తు చేశారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావా వసంత, స్థానిక శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష మాట్లాడారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, రమేష్ బాబు, శ్రీకాంత్ పాల్గొన్నారు