Koppula Eshwar | హైదరాబాద్ : రంజాన్( Ramzan ) పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ముస్లిం( Muslim ) సోదరులకు ఇఫ్తార్ విందు( Iftar Party ) ఇవ్వనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్నాయని తెలిపారు. ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహముద్ అలీ కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. మత సామరస్యం వెల్లివిరిసే విధంగా రంజాన్ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు.దేశంలో సెక్యులర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే అని మంత్రి తెలిపారు. గత 8 సంవత్సరాలుగా రాష్ట్రంలో పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఇఫ్తార్ దవాత్ ఇస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. పేద ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్లు కూడా అందిస్తున్నారని చెప్పారు. ఈ సంవత్సరం 4 లక్షల 50 వేల గిఫ్ట్ ప్యాక్లను లబ్ధిదారులకు అందజేసినట్లు కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని హోం మంత్రి మహముద్ అలీ స్పష్టం చేశారు. ఈసారి కూడా ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఇఫ్తార్ దవాత్కు హాజరవుతారని, అనాథ ముస్లిం పిల్లలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బట్టల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ విందుకు దాదాపు 13 వేల మంది హాజరవుతారని మహముద్ అలీ తెలిపారు.
ఇఫ్తార్ పార్టీకి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా వీవీఐపి, వీఐపీతోపాటు ఇతర పాస్లు జారీ చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఇతర ముస్లిం మత పెద్దలు ప్రధాన వేదికపై ఉంటారని మిగత వారికి వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇఫ్తార్ పార్టీకి సంబంధించి వచ్చిన అతిథులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.