ధర్మపురి : మునుగోడు ఎన్నికల్లో ధర్మమే గెలిచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ.. మంత్రి ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ను ఇరుకున పెడుదామనుకున్న బీజేపీనే.. ఇరుకున పడిందన్నారు.
ప్రజల గుండెల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలున్నాయని, ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రలోభాలకు మునుగోడు ప్రజలు నమ్మలేదన్నారు. చండూరు మండలంలో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు విజయం ప్రజల విజయమన్నారు. ఉప ఎన్నికల సందర్భంగా నెల రోజుల పాటు పార్టీ తరఫున శ్రమించి.. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో భాగస్వాములైన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీకి మునుగోడు ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని అన్నారు. తెలంగాణలో న్యాయమైన ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు.