ధర్మపురి, ఏప్రిల్ 25: ప్రతిపక్ష నాయకులకు పని లేకే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో కొప్పుల మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తును మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. రాష్ర్టానికి కేసీఆర్ పాలన శ్రీరామరక్ష, బీఆర్ఎస్ జెండా పేదలకు కొండంత అండ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతున్నదని ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు రాష్ర్టానికే కాదు ఇప్పుడు దేశానికే అవసరమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్తోనే తెలంగాణలో సుపరిపాలన అందుతున్నదని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా కొనియాడారు.