వెల్గటూర్, మే 9 : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు అద్భుత విజయాన్ని చేకూర్చేలా కార్యకర్తలు పనిచేయాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజక వర్గంలోని ఎండపల్లిలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మండుటెండల్లోనూ చెరువులు నిండుకుండల్లా కన్పిస్తున్నాయని తెలిపారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తూ ఒక బొమ్మరిల్లుగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. యావత్ దేశ ప్రజలు మన రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కావాలని కోరుకుంటున్నారని, సీఎం కేసీఆర్ మున్ముందు దేశ రాజకీయాల్లో రాణించబోతున్నారని స్పష్టం చేశారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ అని మంత్రి పేర్కొన్నారు.