ధర్మారం, అక్టోబర్ 20: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ తెలంగాణ అభివృద్ధిని విస్మరించి అబద్ధాల గ్యారెంటీలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ సర్కారుపై రాహుల్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్నే చదివారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని కొనియాడారు.
శుక్రవారం మంత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. గ్యారెంటీల పేరిట ఉత్తుత్తి హామీలను ఇస్తున్నారని దుయ్యబట్టారు. అరవై ఏండ్లు పాలించి ప్రజలను వంచించిన హస్తం పార్టీని విశ్వసించరని చెప్పారు. ప్రజల కోసం పరితపిస్తున్న సీఎం కేసీఆర్నే మరోసారి ఆశీర్వదిస్తారని ఆయన స్పష్టం చేశారు.