హైదరాబాద్ : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) ఫైర్ అయ్యారు. దేశంలోనే అత్యంత ఎత్తులో 125 అడుగుల భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం(BR Ambedkar Statue) అవిష్కరించుకున్న సందర్భంగా బండి సంజయ్ చేసిన విమర్శలు అర్ధరహితమని అన్నారు. బండి సంజయ్ కు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ను రాజకీయంగా ఎదుర్కోలేక పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, పేపర్ లికేజీ( Paper Leakage,) ఘటనలో పట్టపగలు పట్టు బడిన దొంగ బండి సంజయ్ అని ఆరోపించారు. దళితుల జనోద్ధారణ కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే నైతిక అర్హత అతడికి లేదన్నారు. తెలంగాణ సచివాలయం(Telangana Secretariat) భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు విమర్శలు చేస్తున్నారా… లేక నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నందుకు విమర్శిస్తున్నారా సమాధానం చెప్పాలన్నారు.
ఇప్పటికైనా కేసీఆర్ పై తెలంగాణ సర్కార్ పై చేసిన విమర్శలకు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నోరు అదుపులో పెట్టుకోక పోతే ప్రజలే తగిన రీతిలో సమాధానం చెబుతారని హెచ్చరించారు.