హైదరాబాద్: పదో తరగతి ఫలితాల్లోనూ (10th Results) గురుకుల విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) హర్షం వ్యక్తంచేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. గురుకుల విద్యాసంస్థల (Residential schools) సిబ్బందికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి ఫలితాలే నిదర్శనమని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అమలు చేస్తున్న పథకాలే విద్యారంగం అభివృద్ధికి దొహద పడుతున్నాయని వెల్లడించారు. తెలంగాణ గురుకుల విద్యాలయాలు దేశానికే రోల్ మోడలని వెల్లడించారు.
ఇంటర్, పదో తరగతి ఫలితాలపై సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రతి పరీక్షల్లోను తెలంగాణ విద్యార్థులదే ప్రతిభ ఉంటుందన్నారు. భవిష్యత్లో ఇంత కంటే మెరుగ్గా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయని నమ్మకం వ్యక్తంచేశారు. పదో తరగతి ఫలితాల్లో టీఎస్ రెసిడెన్షియల్ స్కూళ్లు 98.25 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచాయి.
Click Here: TS SSC RESULTS 2023