హుజురాబాద్: శాలపల్లిలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభ విజయవంతమైందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత జాతి ఉద్ధరణకు మహత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సభకు అంచనాలకు మించి లక్షన్నర మందికి పైగా తరలివచ్చినట్లు కొప్పుల పేర్కొన్నారు.
దళితబంధుపథకం ప్రారంభోత్సవ సభకు రాలేకపోయిన తెలంగాణ వాసులు, దేశ, విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు,కోట్లాదిమంది భారతీయులు టీవీల్లో చూసి సంతోషించారు. ఇది దళిత జనులంతా ఆత్మగౌరవంతో తలెత్తుకునే మహాద్భుతమైన పథకంఅని,ఒక ఉద్యమం మాదిరిగా ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి చెప్పడంతో దళిత జాతి హర్షం వ్యక్తం చేస్తున్నదని అన్నారు. ఈ సభ విజయవంతం కావడానికి సహకరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ శ్రేణులకు కొప్పుల ఈశ్వర్ ధన్యవాదాలు తెలిపారు