చండూరు, అక్టోబర్ 27: బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గురువారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం బోడంగిపర్తి, తాస్కానిగూడెం, శిర్దేపల్లి గ్రామాల్లో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
తర్వాత, హైదరాబాద్లో ఉన్న ఆయా గ్రామాల ఓటర్లతో నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మళ్లీ మోసపోయి రాజగోపాల్కు ఓటేస్తే రెండింతలు నష్టపోతామని మంత్రి కొప్పుల హెచ్చరించారు.