హైదరాబాద్ : ట్యాంక్బండ్ ఒడ్డున ఏర్పాటు చేస్తున్న భారతరత్న డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహం తెలంగాణ రాష్ట్రానికే మణిహారంగా నిలుస్తుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డితో కలిసి మంత్రి విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పనులను పూర్తి చేస్తామని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్కు అంబేద్కర్ అంటే ఎంతో గౌరవమని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ ఏర్పాటం ఏర్పాటైందన్నారు.
దేశంలోనే భారీ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతామని, స్మృతి వనాన్ని తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారని మంతి ఈశ్వర్ గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో జనరంజక పాలనను కేసీఆర్ అందిస్తున్నారన్నారు. విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్ తరహా నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విగ్రహం కిందభాగంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీతో పాటు ఆయన గొప్పతనం, జీవిత చరిత్రను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో సినిమా థియేటర్ ఉంటుందని చెప్పారు. పనులు వేగవంతంగా సాగుతున్నాయనిన్నారు. వచ్చే ఏడాది అంబేద్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.