జగిత్యాల : ప్రజా సమస్యలు తెలిసిన, మంచి మనసున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) అన్నారు. ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో బుధవారం దివ్యాంగులకు పెంచిన పెన్షన్ల (Pensions) ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ (CM KCR) వెలుగులు నింపారని కొనియాడారు.
దివ్యాంగులకు(Disable) రూ. 3016 నుంచి రూ.4016 పెన్షన్లు పెంచారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగాపెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఎక్కడాలేదని అన్నారు. దేశ ప్రధాని (Prime Minister ) సొంత రాష్ట్రంలో కూడా కేవలం రూ. 950 మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వడం లేదని అన్నారు. పెన్షన్లు పెంచాలని ఎవరూ అడుగ లేదు. దరఖాస్తు చేయలే. ధర్నా చేయలే. కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి పెన్షన్లు పెంచారని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 5 .11 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ.4016 చొప్పున సంవత్సరానికి రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. గృహలక్ష్మి పథకం, మైనారిటీ బంధు, క్రిస్టియన్ బంధు లాంటి పథకాల్లో 5శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని వివరించారు.