వరంగల్ : ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు(Warangal) కోటలోని స్వయంభు శ్రీ శంభులింగేశ్వర స్వామి(Shambhulingeswara Swamy) వారిని స్త్రీ, శిశు సంక్షేమ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) శుక్రవారం దర్శించుకున్నారు. స్వామి వారికి పూజలు చేశారు. అంతకు ముందు అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపాన్ని రాష్ట్ర మంత్రులతో కలిసి పునఃప్రారంభించారు. అనంతరం యాగశాలలో శాంతి హోమం చేశారు.