వరంగల్ : ఎంజీఎం హాస్పిటల్లో(MGM Hospital) రోగులకు మెరుగైన సేవలు అందించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వైద్యులను ఆదేశించారు. ఆదివారం వరంగల్ ఎంజీఎం దవాఖానలో కొవిడ్(Covid) పై అందిస్తున్న సేవల నేపథ్యంలో వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ నెల 21 నుంచి 170 పరీక్షలు చేయగా 25 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. వీరిలో10 మంది ఎంజీఎంలో చేరగా ఇద్దరు రికవరీ అయ్యారు.
ఏడుగురు చికిత్స పొందుతున్నారు. 1200 ఆక్సిజన్ బెడ్స్, 3 ఆక్సీజన్ ట్యాంక్స్ సిద్ధంగా ఉన్నాయని వివరాలను వెల్లడించారు. పవర్ కట్ అయినపుడు 5 జనరేటర్ల ద్వారా ఎంజీఎంలో నిరంతరాయ విద్యుత్తు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. దవాఖానలో ఇంకా కావాల్సిన సౌకర్యాలపై త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సమావేశం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.