హైదరాబాద్ : పచ్చదనం(greenary) పెంపు పనులు నిరంతరం కొనసాగించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు. డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో హరితనిధి విరాళాలు, ఖర్చుల పై అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హరిత నిధి కేటాయింపులు, ఖర్చుల వివరాలు ఆన్లైన్లో ఉంచాలన్నారు. పూర్తయిన పనుల ఆడిట్ నివేదికలు పునఃపరిశీలించాలని సూచించారు. కాగా, 2021 నుంచి హరిత నిధికి రూ.69.21 కోట్ల విరాళాలు, రూ.43 కోట్ల మేర పనులు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు.