నల్లగొండ : మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ(Nallagonda) పట్టణంలోని పానగల్లోని చారిత్రాత్మక పచ్చల ఛాయా సోమేశ్వరాలయంలో(Chaya Someswara Temple) పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇక్కడ ఉన్న ఆలయాలకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. ఆలయాల అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని చెప్పారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే వారికి వడ్డీలోని రుణాలు ఇస్తామని స్పష్టం చేశారు.