యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామిని రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ఇన్చార్జి ఈవో స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.