నల్లగొండ : మంత్రి అయిన తర్వాత అభివృద్ధి పనులకు నేను పుట్టిన గ్రామానికి రావడం చాల సంతోషంగా ఉందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy )అన్నారు. నార్కెట్పల్లి మండలం బ్రహ్మాణ వెల్లంల గ్రామంలో శుక్రవారం నల్లగొండ నుంచి బ్రాహ్మణ వెల్లంల, బ్రాహ్మణ వెల్లంల నుంచి చిట్యాల వరకు నాలుగు లైన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది వర్ష కాలం వచ్చేనాటికి బ్రహ్మాణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. అలాగే ఆరు నెలల్లో డబుల్ రోడ్డును పూర్తి చేస్తామని చెప్పారు. తాను పుట్టి పెరిగిన ఊరికి ఎంత చేసినా తక్కువే అన్నారు. ప్రతీక్ పేరు మీద లెబ్రరీ నిర్మాణం చేసుకుందామని చెప్పారు. గ్రామాన్ని సోలార్ గ్రామం ప్రాజెక్టుగా ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, తదితరులు ఉన్నారు.