హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని 14 రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడరీకి రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సోమవారం ఢిల్లీకి వెళ్లారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అనంతరం నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు.
తెలంగాణలోని రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు. మార్చిలో తెలంగాణ భవన్కు శంకుస్థాపన చేయనున్నామని, నేడు దానిపై సమీక్ష నిర్వహించనున్నామని తెలిపారు.