హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ఇకపై ఏటా సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించడంపపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాకు బుధవారం ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన మహనీయులందరికీ సరైన గౌరవం దకిందని అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేయడంపపై మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా హర్షం వ్యక్తం చేశారు.