Minister KTR | నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు వేడుకలను సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు కేక్లు కట్ చేశారు. ఆలయాల్లో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పలుచోట్ల మొక్కలు నాటారు. కేటీఆర్ పిలు పు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద పలు సామాజిక సేవ, దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించారు. ఏపీతోపాటు విదేశాల్లోనూ కేటీఆర్ఎస్ బర్త్ డే నిర్వహించారు.
తెలంగాణభవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. మహబూబాబాద్లో రక్తదాన శిబిరాన్ని మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే శంకర్నాయక్ ప్రారంభించారు. హాలియాలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ రక్తదానం చేశారు. కొత్తగూడెంలోని ఉర్దూఘర్లో భద్రాద్రి జడ్పీ వైస్చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 50 యువకులు రక్తదానం చేశారు.
సూర్యాపేట జిల్లా మొగ్గాయిగూడేనికి చెందిన నిరుపేద విద్యార్థిని ధరావత్ స్వాతికి మంత్రి జగదీశ్రెడ్డి ల్యాప్టాప్ను అందించారు. పార్టీ కోసం పనిచేసిన పేద బీఆర్ఎస్ కార్యకర్తలకు 200 ఎలక్ట్రిక్ స్కూటీలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు. ఏంబీఏ ఫీజు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న వెలుగుపల్లికి చెందిన దివ్యాంగుడు చిత్తలూరి వేణుగౌడ్కు తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్కుమార్ రూ.1,76,475 అందజేశారు. మండలి విప్ ఎంఎస్ ప్రభాకర్రావు సచివాలయ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ అయాచితం శ్రీధర్తో కలిసి టీఎన్జీవోల సంఘం నేత ఎండీ ముజీబ్ హుస్సేని అఫ్జల్గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో 300 మందికి రెయిన్కోట్లను పంపిణీ చేశారు. గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ సరూర్నగర్లోని ఆదరణ అనాథాశ్రమానికి ఆర్థిక సాయం అందజేశారు.
మహబూబాబాద్ జిల్లా దవాఖానకు రూ.2 లక్షల విలువైన పరికరాలను ఎమ్మెల్యే శంకర్నాయక్ దంపతులు అందజేశారు. ఖతార్ దేశంలోని దోహాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీధర్గౌడ్ 15 మంది బైక్ ఫుడ్ డెలీవరి బాయ్స్కు 22 లక్షల ఉచిత ప్రమాద బీమా కల్పించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రామగుండం హనుమాన్నగర్లోని నిరుపేద కుటుంబానికి చెందిన మహ్మద్ సలీం, అంతర్గాం మండలం గోలివాడలో నిరుపేద ఒంటరి మహిళ గాదె రాజమ్మకు ఇండ్లు నిర్మించి, గృహ ప్రవేశం చేయించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన వేల్పుల నవ్య పైలట్ శిక్షణ కోసం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 50 వేలు ఆర్థికసాయం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు తాను చదివిన మద్దికుంట పాఠశాల విద్యార్థుల కోసం రూ.3 లక్షల సొంత ఖర్చులతో ఆటో కొని అందజేశారు. కరీంనగర్లోని 33వ డివిజన్లో నిరుపేదల ఇళ్లపై కప్పుకొనే విధంగా రూ.5 లక్షల విలువైన 300లకు పైగా టార్పాలిన్ కవర్లను మేయర్ సునీల్రావు పంపిణీ చేశారు.
ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామస్థులు నా హృదయంలో చిరస్థాయిగా ఉంటారని మంత్రి కేటీఆర్ సోమవారం ట్విట్టర్లో పోస్టు చేశారు. కేటీఆర్ బర్త్డేని పురస్కరించుకొని ఏటా ముక్రా(కే) గ్రామస్థులు మొక్కలు నాటి వందశాతం రక్షిస్తున్నారని, ఇప్పటి వరకు తన పుట్టిన రోజును పురస్కరించుకొని పదివేల మొక్కలు నాటారని ట్వీట్లో పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాస ప్రాంగంణంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ బృందం మొక్కలు నాటింది. ఏపీ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కేటీఆర్ బర్త్ డే నిర్వహించారు. హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి జగదీశ్రెడ్డి తన నివాసంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. నిజామాబాద్ జిల్లాలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు బాలకృష్ణ కుమార్తె సాయిశ్రీ.. మంత్రి కేటీఆర్ 47వ బర్త్డే సందర్భంగా 47 రకాల చిత్రపటాలను గీసింది. సోమవారం సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో వాటిని ప్రదర్శించింది. భద్రాద్రి జిల్లా మణుగూరులో ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు 2 వేల గొడుగులను పంపిణీ చేశారు. దేవరుప్పులలో ఉపాధి హామీ కూలీలకు ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా లంచ్ బ్యాగ్, స్టీల్ వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్ అందజేశారు. ధర్మసాగర్ మండలం కరుణాపురంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వృద్ధులు, వితంతువులకు పండ్లు పంపిణీ చేశారు. వేములవాడ రాజన్న ఆలయంలో ఎమ్మెల్యే రమేశ్బాబు కోడె మొక్కు చెల్లించారు.
మంత్రి కేటీఆర్కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. హైదరాబాద్లో అమెరికన్ కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్, సినీనటులు చిరంజీవి, రవితేజ, రామ్చరణ్, మహేశ్బాబు, మంత్రి సత్యవతి రాథోడ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, టీడీపీ నాయకుడు నారా లోకేశ్, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, గోపీచంద్, మేడె రాజీవ్సాగర్ తదితరులు కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపినవారందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా మేడ్కల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ సుభాష్నగర్కు చెందిన దివ్యాంగుడు వేముల రమేశ్కు బీఎల్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నేత బండారి లక్ష్మారెడ్డి రూ.1.30 లక్షల బైక్ను గిఫ్ట్గా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బీఎల్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం మెచ్చిన నాయకుడుగా, దేశం హర్షించే నేతగా మంత్రి కేటీఆర్ జన నీరాజనాలు అందుకుంటున్నారని, ఆయన బర్త్ డే సందర్భంగా తాను ఈ పుణ్యకార్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. దివ్యాంగులకు ఆసరగా ఉండేందుకు మరో పది బైకులు బుక్ చేసినట్టు తెలిపారు. వీటిలో మొదటి బైక్ను రమేశ్కు అందజేసినట్టు తెలిపారు. బీఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా వాహనం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని వేముల రమేశ్ చెప్పారు.