హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూలు జిల్లా గంట్రావుపల్లిలో డిసెంబర్ 29న జరిగిన చికేపల్లి మల్లేశ్ హత్య కుటుంబ, భూతగాదాల వల్లే జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం ఆయన సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడారు.
ఈ హత్యను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మల్లేశ్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ హత్యను తాము కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మల్లేశ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.