పట్టణాలు, గ్రామాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని, పట్టణ, పల్లెప్రగతి పురోగతిని పరిశీలించాలని మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, శాసనమండలి సభ్యుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జేసీ శ్రీనివాస్రెడ్డితో కలిసి పట్టణ, పల్లె ప్రగతిపై శనివారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
తడి, పొడిచెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసుకోవాలని, వాటితో గ్రామ పంచాయతీలకు ఆదాయం చేకూరుతుందని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం అందించిన ట్రాక్టర్లను వినియోగించాలని సూచించారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో మొక్కలు నాటడంపై ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. నీటి సరఫరాకు ప్రభుత్వం అందించిన ట్రాక్టర్, ట్యాంకర్లను వినియోగించాలని అధికారులకు సూచించారు.