హైదరాబాద్ నుంచి జనగామ దిశగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగింది. ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును పక్కనే ఉన్న కాలువలోకి మళ్లించాడు. ఈ సంఘటన ఆలేరు జనగామ సరిహద్దుల్లో సోమవారం సాయంత్రం జరిగింది.
ఏం జరుగుతున్నదో తెలియక ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అప్పుడే అటుగా వెళ్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తన కాన్వాయ్ని ఆపి, బస్సులో ప్రయాణిస్తున్న ఒక్కొక్కరితో మాట్లాడారు. వారికి మంచినీళ్లు అందించారు. ప్రయాణికులందరిలో ధైర్యాన్ని నింపారు. ఆపదలో తోడుగా నిలిచిన మంత్రి జగదీశ్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు.