సూర్యాపేట/సూర్యాపేట టౌన్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం పదేండ్లలో వందేండ్ల అభివృద్ధి సాధించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని విద్యుత్తు శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున పారిశుధ్య కార్మికులు, మార్నింగ్ వాకర్స్తో మంత్రి మాట్లాడారు. అలాగే దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో అన్ని విధాలుగా ఆగమైన సూర్యాపేట 2014కు ముందు ఎట్లున్నదో.. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినంక ఎంతటి అభివృద్ధి జరిగిందో గమనించాలని సూచించారు. రోడ్ షోలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.