నల్లగొండ : నల్లగొండ పట్టణంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. నల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పలు పనులను పరిశీలించారు. అనంతరం వల్లభ రావు చెరువు,
పానగల్ ఉదయ సముద్రం, మినీ ట్యాంక్ బండ్లపై చేపట్టే అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
పనులన్నింటిని నిర్ణీత గడువులోగా నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. మంత్రి వెంట నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, మున్సిపల్ కమిషనర్ కేవీ రమణ చారి, కౌన్సిలర్ పూజిత, డీఈ విద్యాసాగర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.