హైదరాబాద్ : బంజారాహిల్స్ కేర్ దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఎం సీనియర్ నాయకురాలు, మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యంను రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.