హైదరాబాద్: రాజకీయాలలో ప్రత్యర్థులను సైతం తన భాషతో ఆకట్టుకునే మనస్తత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు (Rosaiah) సొంతమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రోశయ్య ఆకస్మిక మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని మంత్రి చెప్పారు.
ఆర్థిక క్రమశిక్షణను ఆచరించడమే కాకుండా ఇతరులకు మార్గదర్శనం చేసిన నేత రోశయ్య అని కొనియాడారు. రాజకీయాలలో విలువలకు రోశయ్య పెట్టింది పేరని, ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తీరని లోటన్నారు. సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నెరిపిన నేతగానే కాకుండా ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖామంత్రిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు.