సూర్యాపేట : చిరు ఉద్యోగుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మెప్నా రిసోర్స్ పర్సన్లను గుర్తించి ప్రోత్సహించింది సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు ఆయన చలువే అన్న మంత్రి భవిష్యత్లో మరింత పెంపునకు సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.
పేదరిక నిర్మూలనలో మెప్మా ఆర్పీల పాత్ర భేష్ అని కొనియాడారు. మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా సూర్యాపేట నుంచి పోటీ చేయనున్న మంత్రి జగదీష్ రెడ్డికి శుభాకాంక్షలు తలిపేందుకు వచ్చిన ఆర్పీలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గుర్తించాలని, పని చేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వెంపటీ గురూజీ, రాణి, మంగ, తదితరులు పాల్గొన్నారు.