సూర్యాపేట : విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటి చెప్పారు. నిరుద్యోగ యువతీ యువకులు ఏమి తినలేదని చలించి పోయారు. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళా శాల మైదానం లో ఏర్పాటు చేసిన ఆర్మీ రిక్రూట్ మెంట్ ఫ్రీ ర్యాలీ కోసం తెల్లవారుజామునే రాష్ట్ర వ్యాప్తంగా యువతీ యువకులు మైదానానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించడానికి వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి అల్పాహారం లేక యువతీ యువకులు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. వెంటనే సూర్యాపేటలోని వివిధ హోటల్స్ నుంచి అల్పాహారం తెప్పించి 1700 మంది నిరుద్యోగ యువతకు సొంత ఖర్చుతో అందించారు. తమ ఇబ్బందిని తాము చెప్పకుండానే గ్రహించి తమకు అల్పాహారం అందించిన మంత్రికి యువతీ యువకులు జేజేలు పలికారు.
ఇవి కూడా చదవండి..
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ బ్యాటర్
బీజేపీ ఏడేళ్ల పాలనలో 9.5లక్షల మంది ఆత్మహత్య : కాంగ్రెస్
Yadadri | యాదాద్రి స్వర్ణతాపడానికి మంత్రి మల్లారెడ్డి రూ.3.10 కోట్లు విరాళం