సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన కాన్వాయ్ను ఆపి ఓ రైతుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి, రైతు మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. మహబూబాబాద్కు వెళ్లిన మంత్రి తిరిగి వస్తుండగా నూతనకల్ మండలం ఎర్రపాడు వద్ద పొలం నుంచి వస్తున్న రైతును గమనించి జగదీశ్ రెడ్డి తన కారును ఆపారు.
వరి ఎందుకు వేశావని రైతును జగదీశ్ రెడ్డి అడిగారు. కేసీఆర్, మీరు ఉన్నారనే ధైర్యంతో వరి వేశానని రైతు చెప్పి, నవ్వులు పూయించారు. ఎక్కువ పైసలు వచ్చే పంటలను పండించాలని రైతుకు మంత్రి సూచించారు. బ్రహ్మండమైన చెలుక పొలాల్లో బంగారం పండించొచ్చు అని మంత్రి చెప్పారు. ఈ 2 ఎకరాల్లో కూరగాయలు పెడితే 4 లక్షల రూపాయాలు సంపాదించొచ్చు అని జగదీష్ రెడ్డి సూచించారు. రైతు తక్షణమే స్పందించి.. కూరగాయలు పెట్టిన.. రోజుకు రూ. 1000 వరకు సంపాదిస్తున్నానని బదులిచ్చాడు.
సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన కాన్వాయ్ను ఆపి ఓ రైతుతో ముచ్చటించారు. వరి ఎందుకు వేశావని రైతును జగదీశ్ రెడ్డి అడిగారు. కేసీఆర్, మీరు ఉన్నారనే ధైర్యంతో వరి వేశానని రైతు చెప్పి, నవ్వులు పూయించారు. pic.twitter.com/35bO5DzMjM
— Namasthe Telangana (@ntdailyonline) May 7, 2022