Minister Jagadish Reddy | అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, అధికారుల పర్యవేక్షించాలని మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశించారు. సూర్యాపేటలో ఇంటిగ్రేటేడ్ మార్కెట్, నూతన ఎస్పీ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కారిడార్లో మరికొన్ని షాప్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని బల్దియా అధికారులకు సూచించారు. కూరగాయల, నాన్వెజ్ దుకాణాలు, కారిడార్లోని షాప్స్ను పరిశీలించారు. మార్కెట్లో డ్రైనేజ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని సూచించారు. అలాగే మార్కెట్ లోపల భాగంలో స్వచ్ఛమైన గాలి వెళ్లేందుకు ఎయిర్ మిషన్స్ ఏర్పాటు చేయాలన్నారు.
తొలుత ఒక బ్లాక్లో ఏర్పాటు చేసి తదుపరి విస్తరించాలని ఆదేశించారు. షాప్స్ కేటాయింపులో ఎక్కడ కూడా లబ్ధిదారులు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అన్ని షాప్స్ వినియోగంలోకి తీసుకురావాలని, ఐడీకార్డులు అందజేయాలని సూచించారు. సమయం దగ్గరలో ఉన్నందున పనుల్లో వేగం పెంచాలని సూచించారు. అనంతరం జిల్లా పోలీస్ ఆఫీస్ (DPO) పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆఫీస్కి వచ్చే రోడ్ మున్సిపల్ ద్వారా చేపట్టాలని సత్వరమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. కాంపౌండ్ వాల్, కార్యాలయం బయట, లోపల భాగాలను పరిశీలించి పనులు వేగవంతం చేయాలన్నారు. ఆయన వెంట కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ తదితరులు ఉన్నారు.