Minister Jagadish Reddy | మునుగోడులు పదినెలల కాలంలో రూ.500కోట్ల పనులు జరిగాయని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూరులో ఆర్డీవో ఆఫీస్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు కార్యక్రమంలో మాట్లాడారు. కొత్తగా ఆర్డీవో కార్యాలయాన్ని మంజూరు చేసుకొని, ప్రారంభించుకున్న ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న మునుగోడు వెనుకబాటుకు గురైందన్నారు.
ఫోర్లైడ్ మహమ్మారితో ఎంతో మంది చనిపోయారని, నాలుగేళ్లలో మునుగోడులోనే కాదు.. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ను తరిమికొట్టిన ఘనత కేసీఆర్దేనన్నారు. తాగునీటితో పాటు సాగునీరు కోసం శివన్నగూడెం, చర్లగూడెం, కిష్టరాంపల్లి ప్రాజెక్టులను నిర్మిస్తున్నామన్నారు. వెనుకబడ్డ మునుగోడును ఓ వైపు సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధిని సీఎం కేసీఆర్ పరుగులు పెట్టిస్తున్నారన్నారు. మునుగోడులో పది నెలల కాలంలో రూ.500కోట్ల పనులు జరిగాయని, ఈ సమయంలో కొందరు అభివృద్ధికి అడ్డుపడుతున్నారన్నారు. చేసే అభివృద్ధి పనులు అడ్డుకునే పనుల్లో కొందరున్నారని, వారికి బుద్ధి చెప్పాలన్నారు.
బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అభివృద్ధి నిరోధకుడని, ఆయనకు ఈసారి కూడా గట్టి బుద్ధి చెప్పాలన్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, ఆరు గ్యారంటీలు ఇస్తామనేవారు.. అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయన్నారు. అసలు కాంగ్రెస్కే గ్యారంటీ లేదని.. వాళ్ల మాటలకు గ్యారంటీ ఎలా ఉంటుందన్నారు. కాంగ్రెస్ను ఎవరూ నమ్మరని, కాంగ్రెస్ అవుట్ డేటెడ్ పార్టీ అని, అందులో నాయకులు సైతం అవుట్ డేటెడ్ నాయకులేనన్నారు.