Minister Jagadish Reddy | క్రీడలతో మానసిక రుగ్మతలకు చెక్పెట్టవచ్చని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ స్టేడియంలో సోమవారం సీఎం కప్-2023 పోటీలను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలిసి ప్రారంభించారు. తొలుత అఖండ జ్యోతిని వెలిగించి బెలూన్స్ను గాల్లోకి వదిలి పోటీలను ప్రారంభించారు. స్వయంగా క్రీడాకారులతో కలిసి ఆటలు ఆడుతూ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమేనన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఅర్ సంకల్పం అన్నారు. అందులో భాగమే సీఎం కప్-2023 పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.