Minister Jagadish Reddy | భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరు తెలంగాణ రాష్ట్రమని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ముస్లింలకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత సామరస్యానికి తెలంగాణలో పెద్దపీట వేస్తున్నారని.. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ను అధికారికంగా జరిపేది ఇక్కడేనన్నారు. యావత్ భారత దేశానికి రోల్ మోడల్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి మార్గదర్శనంగా నిలిచారన్నారు. సర్వమత విశ్వాసాలను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాటిరారెవరని ఆయన చెప్పారు.
పండుగలను అధికారికంగా నిర్వహించేది ఒక్క తెలంగాణా రాష్ట్రంలో మాత్రమేనని ఆయన తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన ఔదార్యం ఆయన కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ పెట్టింది పేరు అని, ఇది నేను అనడం లేదని స్వాతంత్ర్య పోరాట సమయంలో దేశ పర్యటనలో మహాత్మా గాంధీ అన్నారని ఆయన గుర్తు చేశారు. అలాంటి తెలంగాణా మత సామరస్య పరిరక్షణలో యావత్ భారత దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఇప్పుడు యావత్ భారత దేశానికి మార్గదర్శనంగా మారిందని, అందుకు కారణం అన్ని వర్గాలలో సమతుల్యత పాటించడమే కారణమన్నారు.