మునుగోడు, సెప్టెంబర్ 13: సీఎం కేసీఆర్కు కోట్లాది మంది టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మద్దతు ఉన్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కొత్త ఎజెండాతో దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్తో కలిసి ముందు కు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా మునుగోడు, మర్రిగూడ, గట్టుప్పల్ మండల కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ తెచ్చిన మీరే రాష్ర్టాన్ని బాగుచేసే బాధ్యత తీసుకోవాలని ప్రజలు కోరితే.. సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దలా మారి రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారు. టీఆర్ఎస్ సర్కారు నెలకు రూ.2 వేల పింఛన్ ఇస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రూ.600 ఇస్తున్నారు’ అని చెప్పా రు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తుంటే.. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో 6 గంట లే ఇస్తున్నారని చెప్పారు. బీజేపీకి ఓటేస్తే బాయికాడ మోటర్లకు మీటరొస్తాయని, కాంగ్రెస్ను గెలిపిస్తే కరెంటే లేకుండా పోతుందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఓటేస్తే బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టిస్తారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్కు వచ్చిన మంచి పేరును జీర్ణించుకోలేక ఆయన్ను పడగొట్టాలని మోదీ కుట్రలు చేస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని మునుగోడు, జమస్తాన్పల్లికి చెందిన 300 మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎంపీపీ కర్నాటి స్వామి ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో జమస్తాన్పల్లి సర్పంచ్ పంతంగి పద్మ, ఉప సర్పంచ్ మంగదొడ్ల రాధ, వార్డు సభ్యులు ముంత ధనమ్మ, లక్ష్మయ్య, ముంత మారయ్య, ముత్తయ్య, పంతంగి స్వామి, ఎల్లయ్య, జాజుల శంకర్, పెద్ద అంజయ్య ఉన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యుడు రమేశ్, కాంగ్రెస్కు చెందిన 20 కుటుంబాల వారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మర్రిగూడ మండలం కొండూరుకు చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొన్నారు.