సూర్యాపేట: గవర్నర్ తమిళిసై పై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరో మారు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం గవర్నర్కు ఫ్యాషన్గా మారింది. ఇది సరైంది కాదు అన్నారు.
గవర్నర్ వాఖ్యలపై మంత్రి సూర్యాపేటలో మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు.
ఆమె నిత్యం వార్తల్లో ఉండేదుకు రాజ్ భవన్ను ఉపయోగించుకుని.. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను గౌరవించడంలో కేసీఆర్ వంటి పరిణితి చెందిన నాయకుడు మరొకరు లేరని పేర్కొన్నారు.
గౌరవంగా రాజ్ భవన్ ను నడపాల్సిన గవర్నర్ రాజకీయాలు చేయడం వారి విజ్ఞత కే వదిలేస్తున్నాం. దేశంలో ప్రధాని, రాష్టపతి తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పాలన కొనసాగుతుందన్నారు.