నల్లగొండ : ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణ వార్డు కమిటీల సంస్థాగత ఎన్నికల సమావేశంలో ముఖ్యఅతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది అని మంత్రి పేర్కొన్నారు. పార్టీ పటిష్ఠంగా ఉన్నప్పుడే మందరికీ మంచి బలం ఉంటుందన్నారు. పార్టీ కమిటీలను పటిష్ఠంగా ఏర్పాటు చేయాలి అని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, సత్తయ్య గౌడ్తో పాటు తదితరులు పాల్గొన్నారు.