హైదరాబాద్ : తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు (84) మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవులపల్లి హైదరాబాద్లోని ఓ దవాఖానలో గత మూడు నెలల నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషమించడంతో గురువారం కన్నుమూశారు.